Nagarjuna Akkineni : సీనియర్ హీరో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మణిరత్నం సినిమాల్లో నటించాలనే కోరికతో ఆయన వెంటపడేవాడినని, ఆ కాంబినేషన్లో ‘గీతాంజలి’ వచ్చిందని గుర్తుచేశారు.
నాగార్జున ఆసక్తికర అనుభవం
అక్కినేని కుటుంబ వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన నాగార్జున తన కెరీర్లో ఎదుర్కొన్న అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
మణిరత్నం వెంటపడ్డా.!
“మణిరత్నం తెరకెక్కించే కథల్లో నటించాలనే ఆసక్తితో ఆయన వెంటపడేవాడిని. నాకు ఆయన కథలకు నేను సరిపోతానని అనిపించేది. ఆ కాంబినేషన్లోనే ‘గీతాంజలి’ సినిమా వచ్చింది” అని నాగార్జున తెలిపారు.
Nagarjuna Akkineni తొలి రోజుల జ్ఞాపకాలు..
నా తొలి ఆరు సినిమాలు నాగేశ్వరరావు కొడుకుగా చేశాను. కొందరికి అది నచ్చింది, మరికొందరికి నచ్చలేదు.
‘మజ్ను’ సినిమా నాకు నిజమైన బ్రేక్ ఇచ్చింది.
ఆ తర్వాత‘ ఆఖరి పోరాటం ‘తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాను” అని నాగార్జున గుర్తుచేసుకున్నారు.
Read More : Gaddar Film Awards












